Share this on your social network:
Published:
29-12-2022

783 పోస్టుల‌తో గ్రూప్ – 2 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

హైద‌రాబాద్ : తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేష‌న్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం కానుక‌ను అందించింది. 783 పోస్టుల‌తో గ్రూప్ -2 నోటిఫికేష‌న్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసింది. జ‌న‌వ‌రి 18 నుంచి అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. గ‌తంలో 1032 పోస్టుల‌ను గ్రూప్-2 కింద భ‌ర్తీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే గ్రూప్-1, గ్రూప్-4 నోటిఫికేష‌న్లు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ఫ‌లితాలు కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్నాయి. ఇక గ్రూప్-4 నోటిఫికేష‌న్‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ కూడా త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. హాస్ట‌ల్ వార్డెన్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ అయింది. హార్టిక‌ల్చ‌ర్, వెట‌ర్న‌రీ శాఖ‌ల్లో కూడా కొలువుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డ్డాయి. మ‌రోవైపు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌క్రియ కొన‌సాగిస్తోంది. పోలీసు ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌లో భాగంగా ఫిజిక‌ల్ ఈవెంట్స్ కొన‌సాగుతున్నాయి. మొత్తంగా తెలంగాణ‌లో కొలువుల జాత‌ర కొన‌సాగుతోంది.

Related Images



Related News


ఎస్‌బీఐలో 5008 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన ...


త్వ‌ర‌లో గ్రూప్‌ 2, 3 నోటిఫికేష‌న్‌.. టీఎస్‌పీఎస్సీ కసరత్తు

తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. త్వ‌ర‌లోనే గ్రూ ...


ఇంజినీరింగ్‌ శాఖల్లో 1540 ఏఈఈ పోస్టులు

– రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్‌ శాఖల్లో ఖాళీగా ఉన్న ...


783 పోస్టుల‌తో గ్రూప్ – 2 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

హైద‌రాబాద్ : తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేష‌న్ కోసం ఎదురుచ ...


ఇప్పటికైతే కాంగ్రెస్ లోనే కోమటిరెడ్డి

కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్ కు చేరుకున్నారు కొత ...


గణతంత్రం కాంగ్రెస్ దేశానికి ఇచ్చిన వరం-కల్వకుంట్ల సుజిత్ రావు

గణతంత్రం కాంగ్రెస్ దేశానికి ఇచ్చిన వరం. భారత జాతిని ప్ర ...


గ్రూప్‌-2 అభ్యర్థులకు అలెర్ట్‌...

* పరీక్షా తేదీలను ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ. గ్రూప్‌-2 పర ...


నూతన ధర్నా చౌక్ వెడల్పు పెంచాలని ప్రజా పంధా వినతి

ఖమ్మం,మార్చి 17,సూర్యాపేట టైమ్స్: ఖమ్మం నూతన కలెక్టరేట్ ప ...


దివ్యాంగులు బస్సు పాసులను సద్వినియోగం చేసుకోవాలి

సత్తుపల్లి, మార్చి 17,సూర్యాపేట టైమ్స్: అర్హులైన దివ్యాం ...