నూతన ధర్నా చౌక్ వెడల్పు పెంచాలని ప్రజా పంధా వినతి

ఖమ్మం,మార్చి 17,సూర్యాపేట టైమ్స్: ఖమ్మం నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో ధర్నాలు చేసుకునేందుకు ఏర్పాటు చేస్తున్న కొత్త ధర్నా చౌక్ కేవలం రెండు వందల మందికి మించి కూర్చున్న అవకాశం లేదని, దీని వెడల్పును పెంచి 1000 మంది వరకు ఆందోళనకారులు కూర్చొనే సౌకర్యం పెంచాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ ప్రజా గుపంధా ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా పంధా ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఆవుల అశోక్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ప్రజలు, ప్రజా సంఘాలు చైతన్యవంతంతో అనేక ప్రజా సమస్యలపై పోరాడే చరిత్ర కలిగి ఉన్నాయని,పోరాటాల చరిత్ర కలిగిన ఖమ్మం జిల్లాకు కేవలం 200 మంది కూర్చునే విధంగా ధర్నా చౌక్ ఏర్పాటు చేయడం సరి కాదని, ధర్నా చౌక్ వెడల్పు పెంచి 1000 మంది వరకు కూర్చొని ఆందోళనలు చేసే విధంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నూతనంగా నిర్మిస్తున్న ధర్నా చౌక్ ముందుభాగం సగానికి పైగా మూసేస్తూ నిర్మాణం చేపట్టినారని ముందు భాగం ఎలాంటి గోడలు లేకుండా ఓపెన్ గా ఉంచాలని ఆయన సూచించారు. ఇప్పుడు నిర్మాణం చేస్తున్న ధర్నా చౌక్ లోతు పెంచి వెడల్పు తగ్గించారని ధర్నా చౌక్ వెడల్పు పెంచి స్టేజిని సైతం నిర్మాణం చేయాలని కోరారు .అదేవిధంగా ఖమ్మం నగరంలో పాత కలెక్టరేట్ ముందున్న ధర్నా చౌక్ ను కూడా కొనసాగించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజా పంధా ఖమ్మం నగర కార్యదర్శి టి. ఝాన్సీ, సహాయ కార్యదర్శి చందు, నాయకులు కంకణాల శ్రీను, జె. భరత్, సత్తార్ పాల్గొన్నారు.
Related Images
Related News

ఎస్బీఐలో 5008 జూనియర్ అసోసియేట్ పోస్టులు.. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ...

త్వరలో గ్రూప్ 2, 3 నోటిఫికేషన్.. టీఎస్పీఎస్సీ కసరత్తు
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే గ్రూ ...

ఇంజినీరింగ్ శాఖల్లో 1540 ఏఈఈ పోస్టులు
– రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ శాఖల్లో ఖాళీగా ఉన్న ...

ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ)లతో అసెంబ్లీలో సమావేశమైన మంత్రి శ్రీ కేటీఆర్
ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ) ...

ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ)లతో అసెంబ్లీలో సమావేశమైన మంత్రి శ్రీ కేటీఆర్
ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ) ...

ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ)లతో అసెంబ్లీలో సమావేశమైన మంత్రి శ్రీ కేటీఆర్
ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ) ...

783 పోస్టులతో గ్రూప్ – 2 నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచ ...

ఇప్పటికైతే కాంగ్రెస్ లోనే కోమటిరెడ్డి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్ కు చేరుకున్నారు కొత ...

గణతంత్రం కాంగ్రెస్ దేశానికి ఇచ్చిన వరం-కల్వకుంట్ల సుజిత్ రావు
గణతంత్రం కాంగ్రెస్ దేశానికి ఇచ్చిన వరం. భారత జాతిని ప్ర ...

గ్రూప్-2 అభ్యర్థులకు అలెర్ట్...
* పరీక్షా తేదీలను ప్రకటించిన టీఎస్పీఎస్సీ. గ్రూప్-2 పర ...

నూతన ధర్నా చౌక్ వెడల్పు పెంచాలని ప్రజా పంధా వినతి
ఖమ్మం,మార్చి 17,సూర్యాపేట టైమ్స్: ఖమ్మం నూతన కలెక్టరేట్ ప ...

దివ్యాంగులు బస్సు పాసులను సద్వినియోగం చేసుకోవాలి
సత్తుపల్లి, మార్చి 17,సూర్యాపేట టైమ్స్: అర్హులైన దివ్యాం ...