Share this on your social network:
Published:
17-03-2023

దివ్యాంగులు బస్సు పాసులను సద్వినియోగం చేసుకోవాలి

సత్తుపల్లి, మార్చి 17,సూర్యాపేట టైమ్స్: అర్హులైన దివ్యాంగులు ఆర్టీసీ అందించే రాయితీతో కూడిన బస్సు పాసులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారి రాయప్ప కోరారు. రామానుజవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్ శీలం కోటారెడ్డి, అధ్యక్షతన జరిగిన దివ్యాంగుల బస్సు పాస్ మేళాకు విశేష స్పందన లభించింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన దివ్యాంగులు 50% రాయితీతో కూడిన బస్సు పాసులతో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులలో ప్రయాణించవచ్చునని అన్నారు. ప్రజలు సురక్షితమైన ప్రయాణం కొరకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణించి ఆర్టీసీని ఆదరించాలని కోరారు. గ్రామానికి వచ్చి గ్రామంలోని అర్హులైన దివ్యాంగులందరికీ బస్సు పాసులను అందించడం హర్షినీయమని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఆర్టీసీ బస్సులు ఉన్న సమయంలో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీని ఆదరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు కోడూరి. సత్యనారాయణ, బొగ్గుల. రామకృష్ణారెడ్డి, పంచాయతీ సెక్రెటరీ కటికి.శ్రీనివాసరావు, ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్ శివరాజు, ఆర్టీసీ సిబ్బంది కిన్నెర ఆనందరావు, కంచి సాంసన్ పాల్గొన్నారు.

Related Images



Related News


ఎస్‌బీఐలో 5008 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన ...


త్వ‌ర‌లో గ్రూప్‌ 2, 3 నోటిఫికేష‌న్‌.. టీఎస్‌పీఎస్సీ కసరత్తు

తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. త్వ‌ర‌లోనే గ్రూ ...


ఇంజినీరింగ్‌ శాఖల్లో 1540 ఏఈఈ పోస్టులు

– రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్‌ శాఖల్లో ఖాళీగా ఉన్న ...


783 పోస్టుల‌తో గ్రూప్ – 2 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

హైద‌రాబాద్ : తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేష‌న్ కోసం ఎదురుచ ...


ఇప్పటికైతే కాంగ్రెస్ లోనే కోమటిరెడ్డి

కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్ కు చేరుకున్నారు కొత ...


గణతంత్రం కాంగ్రెస్ దేశానికి ఇచ్చిన వరం-కల్వకుంట్ల సుజిత్ రావు

గణతంత్రం కాంగ్రెస్ దేశానికి ఇచ్చిన వరం. భారత జాతిని ప్ర ...


గ్రూప్‌-2 అభ్యర్థులకు అలెర్ట్‌...

* పరీక్షా తేదీలను ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ. గ్రూప్‌-2 పర ...


నూతన ధర్నా చౌక్ వెడల్పు పెంచాలని ప్రజా పంధా వినతి

ఖమ్మం,మార్చి 17,సూర్యాపేట టైమ్స్: ఖమ్మం నూతన కలెక్టరేట్ ప ...


దివ్యాంగులు బస్సు పాసులను సద్వినియోగం చేసుకోవాలి

సత్తుపల్లి, మార్చి 17,సూర్యాపేట టైమ్స్: అర్హులైన దివ్యాం ...