Share this on your social network:
Published:
06-10-2023

జగన్ పూర్తిగా ప్రజల నమ్మకం కోల్పోయాడు!

*ప్రజాబలం ముందు అధికారం, ధనబలం నిలువలేవు *ఎన్నికలకు సమాయాత్తం కాకుండా చేయాలన్నదే జగన్ కుట్ర *రాజమహేంద్రవరం క్యాంప్ లో ముఖ్యనేతలతో లోకేష్ సమావేశం జగన్ ప్రజల నమ్మకం పూర్తిగా కోల్పోయాడని, కేవలం పోలీసులను, సీఐడీని మాత్రమే నమ్ముకుని రాజకీయం చేస్తున్నారని లోకేష్ అన్నారు. రాజమహేంద్రవరంలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో యువనేత నారా లోకేష్ శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. చంద్రబాబుపైన, తనపైన ప్రభుత్వం వరుసగా పెడుతున్న అక్రమ కేసుల విషయంలో ఢిల్లీలో ఉండి గత మూడువారాలుగా చేస్తున్న న్యాయపోరాటాన్ని నేతలకు వివరించారు. ఇటు ప్రజా క్షేత్రంలో, అటు న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగించాల్సి ఉందని అన్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన 28 రోజుల తరువాత కూడా దర్యాప్తు సంస్థ ఆధారాలు చూపలేకపోవడంతో కేసుల్లో డొల్లతనాన్ని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారని నేతలు అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీగా టీడీపీకి వచ్చిన విరాళాలనే అవినీతి సొమ్ము అని స్కిల్ డెవలప్మెంట్ కేసులో నమ్మించే ప్రయత్నం చేసి సిఐడి మరింత అభాసుపాలైందని లోకేష్ అన్నారు. ప్రజాబలం ముందు అధికార బలం, ధన బలం నిలిచే పరిస్థితి ఉండదని స్పష్టంచేశారు. ప్రభుత్వ కక్ష పూరిత రాజకీయాలపై మరింత ఉద్ధృతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని లోకేష్ నేతలకు సూచించారు. కార్యకర్తల నుంచి అధినేత వరకు అందరిపై కేసులు పెట్టడం ద్వారా ఎన్నికలకు సమాయత్తం కాకుండా చేయాలన్నదే జగన్ రెడ్డి కుట్ర అని పేర్కొన్నారు. ఆధారాలు లేని కేసులు ఎక్కువ రోజులు న్యాయస్థానాల్లో నిలువలేవని, త్వరలో తప్పుడు కేసులనుంచి బయటకు వచ్చి, రెట్టించిన ఉత్సాహంతో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Related Images



Related News


ఎస్‌బీఐలో 5008 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన ...


త్వ‌ర‌లో గ్రూప్‌ 2, 3 నోటిఫికేష‌న్‌.. టీఎస్‌పీఎస్సీ కసరత్తు

తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. త్వ‌ర‌లోనే గ్రూ ...


ఇంజినీరింగ్‌ శాఖల్లో 1540 ఏఈఈ పోస్టులు

– రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్‌ శాఖల్లో ఖాళీగా ఉన్న ...


783 పోస్టుల‌తో గ్రూప్ – 2 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

హైద‌రాబాద్ : తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేష‌న్ కోసం ఎదురుచ ...


ఇప్పటికైతే కాంగ్రెస్ లోనే కోమటిరెడ్డి

కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్ కు చేరుకున్నారు కొత ...


గణతంత్రం కాంగ్రెస్ దేశానికి ఇచ్చిన వరం-కల్వకుంట్ల సుజిత్ రావు

గణతంత్రం కాంగ్రెస్ దేశానికి ఇచ్చిన వరం. భారత జాతిని ప్ర ...


గ్రూప్‌-2 అభ్యర్థులకు అలెర్ట్‌...

* పరీక్షా తేదీలను ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ. గ్రూప్‌-2 పర ...


నూతన ధర్నా చౌక్ వెడల్పు పెంచాలని ప్రజా పంధా వినతి

ఖమ్మం,మార్చి 17,సూర్యాపేట టైమ్స్: ఖమ్మం నూతన కలెక్టరేట్ ప ...


దివ్యాంగులు బస్సు పాసులను సద్వినియోగం చేసుకోవాలి

సత్తుపల్లి, మార్చి 17,సూర్యాపేట టైమ్స్: అర్హులైన దివ్యాం ...